హుజూర్నగర్ టౌన్: హుజూర్నగర్ మున్సిపలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ టీపీఎస్ అధికారి విధులను అడ్డుకో వటమే కాకుండా అతనిపై దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో మంగళవారం మున్సిపల్ ఉద్యోగులు విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
టౌన్ ప్లానింగ్ అధికారి నగరం మధు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో కమిషనర్ నరేష్రెడ్డి ఆదేశానుసారం పట్టణం లోని లింగగిరి రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు. అందులో భాగంగా11 వ వార్డు కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ షాపు మెట్లను తొలగిస్తున్నారు.
ఆ సమయంలో శ్రవణ్ తన మీదకు వచ్చి చెంపపై రెండు సార్లు కొట్టారన్నారు. ఈ ఘటనపై మున్సిపల్ ఉద్యోగులు ఖండించారు. ర్యాలీలో శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, శారత, నాగిరెడ్డి, మల్లేశ్, పద్మ, ఉపేందర్, లతీఫ్, విజయ్, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.