నేరేడుచర్ల: కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేరేడుచర్ల మండలానికి చెందిన పాత్రికేయుడు ఈగ శ్రీనివాసరావు, ఆయన మాతృమూర్తి రాజ్యంలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6 లక్షలు మంజూరు కాగా సోమవారం అట్టి చెక్కును టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతున్న దన్నారు. అనారోగ్యం పాలైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నియోజకవర్గంలోని వందల మందికి ఆర్ధిక సాయం అందించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, వైస్ చైర్పర్సన్ చల్లా శ్రీలత, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పి రెడ్డి, కౌన్సిలర్లు సాయి, బాష, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, టీఆర్ఎస్ నాయకులు సైదులు, రాములు, సుందరయ్య, మల్ల య్య, రాజేశ్, శ్రీను, నారాయణ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.