సూర్యాపేట లీగల్, ఏప్రిల్ 20 : రాష్ట్రంలో జిల్లా న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తులు బదిలీ అయ్యారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.అమరావతి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఎస్.గోవర్ధన్రెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, భద్రాద్రి కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.శ్యామ్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీపై రానున్నారు.