Nitish Kumar | దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించి పోవడం ఖాయం అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తేల్చి చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రాజవంశ వారసత్వ రాజకీయాలకు చేస్తున్నదని ఆరోపించారు. ఆదివారం కిషన్గంజ్లో జేడీయూ అభ్యర్థి ముజాహిద్ ఆలంకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో నితీశ్ కుమార్ మాట్లాడారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేరెత్తకుండానే ఆయన తన పిల్లలకు రాజకీయ భవిష్యత్ కల్పించడంలో బిజీబిజీగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
అవి పరివాద్ పార్టీలు. మొదట ఆయనే (లాలూ ప్రసాద్ యాదవ్) అధికారంలో ఉన్నారు. తర్వాత కొడుకులు, ఇప్పుడు తన కుమార్తెలను ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాల్లో నా కుటుంబ సభ్యుల్లేరు. మేం అందరికోసం పని చేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏమైంది. కాంగ్రెస్ పార్టీని నడిపించే వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుంది అని నితీశ్ కుమార్ అన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ మొత్తం తానే అభివృద్ధి చేశానని క్రెడిట్ కొట్టేడానికి ప్రయత్నిస్తున్నాడు. లాలూ హయాంలో ఏం జరిగిందో మీకందరికీ తెలుసు. రాష్ట్రాభివృద్ధి కోసం మేం పని చేస్తే, ఆ క్రెడిట్ కొట్టేయడానికి తేజస్వి యాదవ్ ప్రయత్నిస్తున్నాడు అని నితీశ్ కుమార్ చెప్పారు.