మునగాల: ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తు న్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని గణపవరం గ్రామ శివారులో కోతకు గురైన రోడ్డును కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని రోజులు గా కురుస్తున్న భారీ వర్షాల వలన వాగు ప్రదేశంలో నీటి ఉదృతి అధికమై రోడ్డు కోతకు గురై గణపవరం మీదుగా రాకపోక లు నిలిచిపోయిన విషయం గ్రామస్తులు తన దృష్టికి తీసుకుని వచ్చారని తెలిపారు.
వెంటనే సమస్యను జిల్లా అధికారులు. మంత్రి జగదీశ్రెడ్డికి వివరించామని తెలిపారు. వారి సహకారంతో సమస్య పరిష్కా రానికి ఎస్టిమేట్ వేయించినట్లు తెలిపారు. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.13 లక్షల నిధులు మంజూరయ్యాయని తక్షణమే పనులు నిర్వహించ బడుతాయని తెలిపారు. భవిష్యత్లో రూ. 5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. నిధుల మంజూరుకు మంత్రి సంపూర్ణ సహాయసహకరాలు అందించారని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ ఎలక బింధు, జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల, సర్పంచ్లు కొండపల్లి విజయ నర్సింహరావు, సొసైటీ చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, చందా చంద్రయ్య, నాయకులు ఉప్పు ల యూగందర్రెడ్డి, కోల ఉపేందర్రావు, కేతి రెడ్డి సత్యనారాయణరెడ్డి, గౌని శ్రీనివా స్, జితేందర్రెడ్డి, బుర్రి శ్రీరాములు, మెదరమెట్ల వెంకటేశ్వరావు, దేవరం వెంకట రెడ్డి, చందా రామకృష్ణ, ఎస్ఐ శ్రీనివాసులు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో భూపాల్రెడ్డి, వీఆర్వో సంజీవ రావు, గ్రామ కార్యదర్శి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.