కోదాడ: తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టుక నుంచి చావు వరకు అండగా నిలుస్తున్న మహనేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మునగాల మండలానికి చెందిన 30 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు మరో 10 మందికి రూ. 2,15,500ల సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడ బిడ్డల పెండ్లికి రూ. 1,00116లు అందజేసి మేనమా మగా వారి గుండెల్లో నిలిచారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలను ఆదుకోలేదని, ముఖ్యమం త్రి కేసీఆర్ పథకం వెనుక మానవీయ కోణం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, రైతు బంధు సమితి అధ్యక్షుడు సుంకర అజయ్కుమార్, మండలాధ్యక్షుడు రమేశ్, మాజీ జడ్పీటీసీ కోలా ఉపేందర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.