కోదాడటౌన్: కోదాడ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చెత్త సేకరణకు నూతనంగా ఏర్పాటు చేసిన చేసిన ఒక ట్రాక్టర్తో పాటు 10 ట్రాలీ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో చెత్తను తరలించడానికి ట్రాక్టర్లను కొనుగోలు చేశామని అన్నారు.
ప్రభుత్వం నుంచి అధిక నిధులు మంజూరు చేయించి మున్సిపాలిటీని అబివృద్ధి పథంలో నడిపేందు కు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పారిశుధ్య విభాగంలో ప్రతిభ కనబరిచిన కార్మికులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్రా సుధారాణి, పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, వైస్ చైర్పర్సన్ వెంపటి మద్మధుసూధన్, కమీషనర్ నాగేంద్రబాబు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.