సూర్యాపేట : టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన ఎమ్మార్పీఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పార్టీలో చేరిన వారిలో బచ్చలకూరి నాగబాబు, యలవలపూడి గోపి, బుర్ర లచయ్య, బచ్చలకూరి రోశయ్య, రాజేష్, బుర్ర గురవయ్య, గుండెపంగు సురేష్, బుడెగ కొండల్, ఉప్పతల కనకరావు, ముద్రబోయిన గోపి, నిమ్మల గోపి, కందుకూరి ప్రభుదాస్, ఎస్కే పాషా, కర్రీ శ్రీను,పొట్టేపంగు సైదులు, తదితరులు ఉన్నారు.