సూర్యాపేట : టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండలం మాదారం గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తులు పెద్ద ఎత్తున తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.