హుజూర్నగర్: తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయగలిగే పార్టీ ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు పార్టీలకు చెందిన సుమారు వంద మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.
దళితబంధు లాంటి ఎన్నో గొప్ప గొప్ప సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కు తుందన్నారు. పార్టీలో కష్ట పడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, మార్కెట్ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, గెల్లి రవి, బెల్లం కొండ అమర్, దొంతగాని శ్రీనివాస్గౌడ్, అట్లూరి హరిబాబు, తండు సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.