నేరేడుచర్ల : వివిధ అనారోగ్యాలతో ఆసుపత్రిపాలై ఆర్థికంగా నష్టపోతున్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేరేడుచర్ల, పాలకవీడు మండలాలకు చెందిన 41మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఆదివారం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అందించిన విధంగా నియోజకవర్గంలో ప్రతి రెండు నెలలకు సుమారు రూ. 2 నుంచి రూ. 3కోట్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 13,85,500 లక్షలు మంజూరైంది. నేరేడుచర్ల మండలంలోని 22మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 6,12,700, నేరేడుచర్ల మున్సిపాలిటీలోని నలుగురికి రూ. 2,18,000, పాలకవీడు మండలంలోని 15మంది లబ్ధిదారులకు రూ. 5,55,00 లక్షలు మంజూరు కాగా చెక్కులను ఆయా మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.
కార్యక్రమంలో నేరేడుచర్ల జెడ్పీటీసీ రాపోలు నర్సయ్య, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్ చందమళ్ల జయబాబు, చల్లా శ్రీలతరెడ్డి, నేరేడుచర్ల, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు అరిబండిసురేష్ బాబు, కిష్టపాటి అంజిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, పాలకవీడు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, నాయకులు మలిమంటి దర్గారావు, వెంకటరెడ్డి, రవి పాల్గొన్నారు.