సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ సూర్యాపేటలో జోరుగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 27 వార్డులో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో వాడవాడలా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నామరు.
ఈ కార్యక్రమానికి అన్ని రంగాల ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజలే స్వచ్ఛందంగా తమకు వివరిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పాలనపై కోపంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నిమ్మల స్రవంతి శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు నల్లపాటి అప్పారావు, రేపల్లె ఉపేందర్, లతీఫ్, వట్టే లింగరాజు, వెంపటి శ్రీనివాస్, నాగరాజు, సుదర్శన్, సఫియా, ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు.త