యాదాద్రి భువనగిరి, జూలై11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బొమ్మలరామారం, బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, వలిగొండ మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదవ్వగా ఆత్మకూరు(ఎం) మండలంలో వర్షం చినుకులకు మాత్రమే పరిమితమైంది. మిగతా చోట్లా వర్షం ఆశించిన స్థాయిలో పడింది.
జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..
వారం రోజులుగా జిల్లాలో అడపాదడపాగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని 16 మండలాల్లో ఆదివారం ఉదయం 8.30నుంచి సాయంత్రం 6 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గుండాల మం డలంలో 33.0 మి.మీ., మోత్కూరులో 70.4 మి.మీ., అడ్డగూడూరులో 55.0 మి.మీ., రాజాపేటలో 17.4 మి.మీ., తుర్కపల్లిలో18.5 మి.మీ., భువనగిరిలో 14.6 మి.మీ., ఆలేరులో18.4 మి.మీ., యాదగిరిగుట్టలో 19.5 మి.మీ., వలిగొండలో 5.6 మి.మీ., బీబీనగర్లో 7.9 మి.మీ., బొమ్మలరామారంలో 7.5 మి.మీ., రామన్నపేటలో 12.3 మి.మీ., పోచంపల్లిలో 7.5 మి.మీ., చౌటుప్పల్లో 8.5 మి.మీ., మోటకొండూరులో 13.3మి.మీ., నారాయణపురంలో 14.0మి. మీ. లుగా వర్షపాతం నమోదు కాగా, జిల్లాలో సగటు వర్షపాతం 19.0మీ.మీ.లుగా నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కంది, పత్తి పంటలకు మేలు చేకూరుస్తుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనుండటం తో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు హెడ్ క్వార్టర్స్లో ఉండి పరిస్థితులను పర్యవేక్షించి సహాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు చెరువుల్లో ఎప్పటికప్పు డు నీటి మట్టాలను పరిశీలించి వరద ఉధృతిని అంచనా వేయాలన్నారు.