జోగులాంబ గద్వాల : జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ధరూర్ మండలంలోని జూరాల బ్యాక్ వాటర్ నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి నీళ్లు వస్తుండగా నెట్టెంపాడు ప్రాజెక్టు ఫేస్ వన్ నుంచి ఎమ్మెల్యే మోటర్ ఆన్ చేసి గుడ్డం దొడ్డి ర్యాలంపాడు రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఏడాది కంటే నెల రోజుల ముందుగానే పంపు ఆన్ చేయడం సంతోషం సంతోషంగా ఉందన్నారు. ఎగువన వర్షాలు కురవడంతో జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకొని నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీటిని గుడ్డం దొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను నింపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీజేపీ ఎస్ఈ శ్రీనివాస రావు, ఈఈ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పవిత్ర స్నానాల కోసం వచ్చి ప్రాణాలు విడిచారు
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి