పెద్దపల్లి జిల్లాలో మార్చి నుంచి అందుబాటులోకి సేవలు
ప్రతి రోజూ 12 గంటల నుంచి 2 గంటల వరకు వేళలు
ప్రత్యేక వైద్య నిపుణులతో సలహాలు, సూచనలు
వినియోగించుకుంటున్న రోగులు
పెద్దపల్లి, మే 4 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లాలో టెలీ మెడిసిన్ వైద్యానికి ప్రజల నుంచి స్పందన లభిస్తున్నది. ఈ వైద్య సేవలను అందించేందుకు డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, డీఐవో కృపాబాయి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశా రు. జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖాన, గోదావరిఖని ప్రభుత్వ ఏరియా దవాఖాన కేంద్రంగా ప్రత్యేక వైద్యులు జిల్లాలోని 21 పీహెచ్సీలు, యూపీహెచ్సీల పరిధిలోని రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. సెలవు దినాలు మినహా ఇతర రోజుల్లో అందుబాటులో ఉంటున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ప్రత్యేక వైద్యులు టెలీ, వీడియో కాలింగ్ ద్వారా వైద్యాన్ని అందిస్తున్నారు. ఇందుకు గాను ఆయా వైద్యశాలలో టెలీ, వీడియో సేవలను అందుబాటులోకి తెచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు. కంప్యూటర్లు, కెమెరాలు, ఇంటర్నెట్ సేవలను మెరుగు పరిచారు.
షెడ్యూల్ ఇదే..
సెలవు దినాలు మినహా మిగతా రోజుల్లో ప్రతి రోజూ రెండు గంటల పాటు టెలీ వైద్య సేవలను అందిస్తున్నారు. పీహెచ్సీకి ప్రత్యేక వైద్యం కోసం వచ్చిన రోగుల ఓపీని రాసే అక్కడి వైద్యులు ప్ర త్యేక వైద్య నిపుణుల ద్వారా వైద్య సేవలను అం దించేందుకు నిర్దేశించిన తేదీలను వారికి వివరిస్తున్నారు. దాంతో రోగులు ఆయా రోజుల్లోనే వచ్చి టెలీ మెడిసిన్ సేవలను పొందుతున్నారు. ప్రతి సోమవారం మహిళల కోసం గైనిక్, డెర్మటాలజీ సేవలు, మంగళవారం ఈఎన్టీ, ఆప్తమాలజీ, బుధవారం జనరల్, గురువారం పిల్లల వైద్య సే వలు, జనరల్ సర్జన్, శుక్రవారం గైనిక్, శనివారం ఆర్థోపెడిక్ సేవలను అందిస్తున్నారు.
క్రమంగా పెరుగుతున్న సేవలు..
కరోనా ప్రత్యేక పరిస్థితుల కారణంగా టెలీ మె డిసిన్ వైద్య సేవలు క్రమంగా పెరుగతున్నాయి. అ యితే, ప్రతీ పీహెచ్సీ, యూపీహెచ్సీల పరిధిలో ప్రత్యేక వైద్య సేవలు అవసరమయ్యే వారి సంఖ్య కాస్త తక్కువగానే ఉంటుంది. మార్చి నెలలో 20 మందికి టెలీ మెడిసిన్ సేవలు అందగా, ఏప్రిల్ నెలలో 22మందికి ఈ సేవలు అందాయి.