అమరావతి : ఏపీలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 103 మంది కోలుకున్నారు. కర్నూల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటివరకు 8,92,008కి చేరింది. 8,83,380 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 1,443 యాక్టివ్ కేసులుండగా.. 7,185 మంది మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 22,604 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1,45,57,366 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.