మధురం.. మధురాక్షరం!
‘మరల నిదేల రామాయణమన్నచో..’ అంటూ రామాయణ కల్పవృక్షం గురించి విశ్వనాథ సత్యనారాయణ చేసుకున్న సమర్థనే సింహప్రసాద్ ‘శ్రీరాముడి ధర్మపథం’ పుస్తకానికీ వర్తిస్తుంది. ఎవరు చెప్పినా, మరొకరికి అవకాశం ఉండనే ఉంటుంది. ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది. అది రాముడి గొప్పదనం, రామాయణ విస్తృతి. ఈ పుస్తకంలో రాముడి వ్యక్తిత్వాన్ని, రామతత్వాన్ని, అవతార రహస్యాన్ని, రామబాణ ప్రతాపాన్ని.. సభక్తిపూర్వకంగా వివరించారు రచయిత. ‘మధురం మధురాక్షరం’ అన్నంత గొప్పగా ఆదికావ్యాన్ని మలచిన వాల్మీకి మహర్షికి ప్రణతులర్పించారు కూడా. ‘రామాయణం ఓ ఇక్షు సాగరం. ఎక్కడ దోసిలి పట్టి తాగినా తియ్యదనమే. మానవ జాతి తాపత్రయాలను పోగొట్టి.. శరణాగతి తత్వానికి ప్రాధాన్యమిచ్చాడు వాల్మీకి. ఒక్కొక్క కాండలో ఒక్కొక్క రసావిష్కరణ చేశాడు. శరణాగతికి నిలువెత్తు గోపురం రామాయణం’ అనడం మరింత బాగుంది. మనలోని పదితలల అహంకారాన్ని వదిలించుకోడానికి ఉపకరించే రచన ఇది.
శ్రీరాముడి ధర్మపథం (వాల్మీకి రామాయణం ఆధారంగా)
రచన: సింహ ప్రసాద్
పేజీలు: 344; వెల రూ. 350
ప్రతులకు: 98490 61668
ప్రేమ పవనాలు- మానవతా సౌరభాలు
రచన: గులాబీల మల్లారెడ్డి
పేజీలు: 200, ధర: రూ. 200
ప్రతులకు: ఫోన్: 94400 41351
నవ్వులే నవ్వులు
పేజీలు: 40, ధర: రూ. 40
రచయిత: షేక్ అస్లాం షరీఫ్
ప్రచురణ: అస్లాంగోరి ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 94411 67616
వెలుగుల నీడ
రచన: మెట్టు శ్రీనివాస్
పేజీలు: 119
ధర: రూ. 140
ప్రచురణ: తెలంగాణ పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 86399 72160
వేగుచుక్క
రచన: కె.లక్ష్మణ్ గౌడ్
పేజీలు: 166, ధర: రూ. 200
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 97049 30509