ఇప్పుడంటే.. నాన్స్టిక్లూ కుక్కర్లూ వచ్చాయి కానీ, ఆ రోజుల్లో తెలంగాణ లోగిళ్ళలో కట్టెల పొయ్యిమీద మట్టి కంచుట్లో చేపల పులుసు ఉడుకుతుంటే.. ఆ ఘుమఘుమలు వాడవాడంతా వ్యాపించేవి. ఉడుకుతున్న పులుసులో.. తేలుతున్న ముక్కలను చూస్తూ నోరూరి లొట్టలేయడం సరేసరి. కంచంలో కమ్మటి చేపల పులుసుందంటే మటన్, చికెన్.. ఏదైనా బలాదూర్. వివిధ ప్రాంతాల్లో రకరకాల పద్ధతుల్లో చేసే చేపల పులుసు.. ఆ ప్రాంతం పేరుతోనే ఫేమస్ అవుతుంది. మరి, మనతెలంగాణ చేపల పులుసు సంగతులేంటో చూద్దాం..ఏ వంటైనా వేడివేడిగా తింటే రుచి. కానీ, చేపల పులుసు మాత్రం ఓ పూట ఊరితేనే రుచి రెట్టింపవుతుంది. చింత పులుసులో చేప ముక్కలు బాగా నానిపోయి, వాటిలోని సారం పులుసులోకి దిగితేనే కూర రుచి పెరుగుతుంది. ఏదేమైనా అంతసేపు ఎదురుచూశాం కదా.. అని ఆగమాగం తినడానికుండదు. ఓపిగ్గా ముళ్ళు ఒలుచుకుంటూ ఆరగించాల్సిందే.
ఇవీ కూడా చదవండి…
జోస్ అలుక్కాస్ ప్రచారకర్తగా కీర్తి సురేశ్