రాంచి, ఏప్రిల్ 17: కోట్ల రూపాయల పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించి డమ్కా ట్రెజరీ కేసులో సగం శిక్ష పూర్తి చేసుకున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూ విడుదలకు సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. సోమవారం విడుదలయ్యే అవకాశం ఉన్నది. పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే దేవ్గఢ్, చాయిబస, దొరండ ట్రెజరీ కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది.