Parineetha | షోలాపూర్కు చెందిన పరిణీత సాంకేతిక దిగ్గజం గూగుల్లో టీమ్ లీడర్గా ఎంపికయ్యారు. వార్షిక ప్యాకేజీ ఆఫర్ పెద్దమొత్తంలో ఉండటంతో అందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా పరిణీతకు తెలుగు నేలతో అనుబంధం ఉన్న కారణంగా షోలాపూర్లోని తెలుగు ప్రజలు సైతం పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.
గూగుల్లో రూ.1.30 కోట్ల ప్యాకేజీ పొందడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. షోలాపూర్లోని లిటిల్ ఫ్లవర్లో పరిణీత పాఠశాల విద్య పూర్తిచేసింది. ఆ తర్వాతి విద్యాభ్యాసం హైదరాబాద్లో సాగింది. తండ్రి మదన్ ఉద్యోగ రీత్యా పన్నెండేండ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 2013లో ఐఐటీ ఇండోర్లో ప్రవేశం పొందింది పరిణీత.
అక్కడ బీటెక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో అమెరికాకు చెందిన బీమా కంపెనీలో ఉద్యోగం సాధించింది. తర్వాత కొంతకాలం ఉబర్, యూఎస్జీలో పనిచేసింది. పరిణీత నైపుణ్యాన్ని మెచ్చిన గూగుల్ ఆమెకు తాజా ఆఫర్ ఇచ్చింది. ఆమెను బెంగళూరు క్యాంపస్లో టీమ్ లీడర్గా ఎంపికచేసింది. తన విజయంలో గురువులు, తల్లిదండ్రులు ముఖ్యపాత్ర పోషించారని పరిణీత చెబుతున్నది.