IND vs ENG 2nd Test : విశాఖపట్టణం టెస్టులో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(125నాటౌట్ : 185 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్లు) క్రీజులో పాతుకు పోయాడు. సెంచరీతో మెరిసిన ఈ యంగ్స్టర్, అరంగేట్రం బ్యాటర్ రజత్ పాటిదార్ (25)తో మరో భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నాడు. దాంతో, టీ సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు స్కోర్ చేసింది.
లంచ్ తర్వాత సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్(27)ను టామ్ హర్ట్లే వెనక్కి పంపాడు. దాంతో, టీమిండియా 179 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పాటిదార్, యశస్వీలు నాలుగో వికెట్కు 46 రన్స్ జోడించారు. పాటిదార్ తొలి మ్యాచ్లోనే కీలక ఇన్నింగ్స్తో జట్టుకు అండగా నిలిచాడు.
Yashasvi Jaiswal is leading the way as India eye a big first-innings total #INDvENG
▶️ https://t.co/ZsyelyZUeZ pic.twitter.com/Hs8lN4ut8E
— ESPNcricinfo (@ESPNcricinfo) February 2, 2024
తొలి టెస్టులో కొద్దిలో సెంచరీ చేజార్చుకున్న యశస్వీ వైజాగ్లో మూడంకెల స్కోర్ కొట్టేశాడు. లంచ్ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన యశస్వీ… స్పిన్నర్ టామ్ హర్ట్లే బౌలింగ్లో సిక్సర్తో శతకం బాదాడు. సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడుతున్న ఈ యువ ఓపెనర్ భారత్కు భారీ స్కోర్ అందించే పనిలో ఉన్నాడు.