John Cena : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) మాజీ చాంపియన్ జాన్ సేన(John Cena) అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తాను మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈలోకి వస్తున్నానని, త్వరలోనే భారత గడ్డపై తొలి మ్యాచ్ ఆడనున్నాని వెల్లడించాడు. 16 సార్లు చాంపియన్గా నిలిచిన సేన సెప్టెంబర్ 1న పెన్నిసిల్వానియాలో తొలి బౌట్ ఆడనున్నాడు. హైదరాబాద్లో సెప్టెంబర్ 8న జరుగనున్న డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టకిల్(WWE Superstar Spectacle)లో రింగులోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సేన సోషల్మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించాడు.
‘స్మాక్డౌన్ షోలో డబ్ల్యూడబ్ల్యూఈ కుటుంబాన్ని కలిసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. మరీ ముఖ్యంగా భారత్లోని డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులను అలరించబోతున్నా. భారత్లో తొలిసారి రింగ్లోకి దిగబోతున్నా. మీ అందర్నీ త్వరలోనే కలుస్తాను. డబ్ల్యూడబ్ల్యూఈ, డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా’ అని సేన తన పోస్ట్లో రాసుకొచ్చాడు.
Cannot wait to reunite with the @WWE family live on #Smackdown! Especially excited to meet the #WWE Universe in India and wrestle for the FIRST TIME EVER in 🇮🇳!
The time is NOW…. C U all VERY soon!!! @WWE @WWEIndia https://t.co/ZtvpIBlgAm— John Cena (@JohnCena) August 21, 2023
ప్రస్తుతంఅతడి పోస్ట్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది. అయితే.. జాన్ సేనతో తలపడేది ఎవరు? అనేది తెలియాల్సి ఉంది. డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలకు గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియం(Balayogi Indoor Stadium) ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆస్టన్ థియరీ(Austin Theory) ‘రెజిల్ మానియా’ పోటీలో జాన్ సేనను ఓడించాడు. దాంతో, ఈసారి అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని సేన కసితో ఉన్నాడు. ఆస్ట్రేలియా రెజ్లర్ గ్రేసన్ వాలర్(Grayson Waller) కూడా సేనతో పోటీ పడేందుకు ఎదురు చూస్తున్నాడు. అంతేకాదు కెనడాకు చెందిన జిందర్ మహల్(Jinder Mahal) కూడా సేనతో అమీతుమీకి సిద్ధపడుతున్నాడు.