WTC Points Table | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో (2023-25) సైకిల్ మొదలైంది. టెస్ట్ చాంపియన్షిప్ కోసం తొమ్మిది జట్లు పోటీపడుతుండగా.. ఇప్పటికే ఆరు జట్లు ఒక్కో సిరీస్లో పాల్గొన్నాయి. అయితే, మరో మూడు జట్లు మాత్రం ఇంకా మ్యాచులను మొదలుపెట్టలేదు. ఇందులో అత్యధికంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అత్యధికంగా ఐదు టెస్టులు మ్యాచ్లు అడాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్ తలో రెండు మ్యాచ్లు ఆడాయి. టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్లో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ త్వరలో మ్యాచులు ఆడనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం పాకిస్థాన్ మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. అయితే, ఫైనల్ వరకు రెండు జట్లే తొలి రెండుస్థానాల్లో కొనసాగితే.. టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాతి ఫైనల్ భారత్-పాక్ మధ్యే జరుగనున్నది.
టెస్ట్ చాంఫియన్షిప్ పాయింట్ల పట్టికను పాయింట్ల కోత ప్రభావితం చేసింది. యాషెస్ ముగిసే టెస్ట్ సిరీస్ ముగిసే సరికి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల పాయింట్లలో ఐసీసీ కోత విధించింది. సిరీస్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ 19 పాయింట్లు, ఆస్ట్రేలియా 10 పాయింట్లు కోల్పోయాయి. దాంతో పాయింట్ల పట్టిక ప్రభావితమైంది. ప్రస్తుతం పాయింట్ల జాబితాలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో, ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. శ్రీలంకపై క్లీన్ స్వీప్ తర్వాత, పాకిస్తాన్ 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. అయితే, వెస్టిండిస్తో భారత్ తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించింది. రెండో మ్యాచ్పై వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. అలాగే, ఇంగ్లండ్ – ఆస్ట్రేలియా యాషెస్ టెస్ట్ సిరీస్కు ముందు ఆస్ట్రేలియా 26 పాయింట్లతో ఉన్నది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ పాయింట్లలో కోత విధించడంతో మూడోస్థానానికి చేరింది.