Meg Lanning : ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మేగ్ లానింగ్ ప్రపంచ క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఏ కెప్టెన్కు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. అంతేకాదు దిగ్గజ కెప్టెన్లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), మహేంద్ర సింగ్ ధోనీ (భారత్)లను ఆమె దాటేసింది. అత్యధిక ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి కెప్టెన్గా చరిత్ర సృష్టించింది. అవును.. మేగ్ లానింగ్ కెప్టెన్సీలో ఆసీస్ మహిళల జట్టు ఐదు సార్లు జగజ్జేతగా నిలిచింది.
ఆస్ట్రేలియా మహిళల జట్టు 2014, 2018, 2020, 2023లో పొట్టి ప్రపంచకప్, 2023లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అంతేకాదు 2022 కామన్వెల్త్ గేమ్స్లో కూడా లానింగ్ సారథ్యంలోని ఆసీస్ ఛాంపియన్గా అవతరించింది. దాంతో, ఆసీస్కు ఐదు ఐసీసీ ట్రోఫీలు అందించిన తొలి కెప్టెన్గా లానింగ్ రికార్డుల్లోకి ఎక్కింది.
ఇప్పటివరకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు సాధించిన కెప్టెన్లు ముగ్గురు ఉన్నారు. ఆ జాబితాలో మేగ్ లానింగ్ అగ్రస్థానంలో ఉండగా రికీ పాంటింగ్ రెండో స్థానంలో నిలిచాడు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా రెండు వరల్డ్ కప్లు (2003, 2007), రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు (2006, 2009) అందుకుంది. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సారథ్యంలో టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గింది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది.
కేప్టౌన్లోని న్యూలాండ్స్లో ఆదివారం జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. దాంతో, ఆరోసారి సగర్వంగా పొట్టి ప్రపంచకప్ను ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 156 రన్స్ చేసింది. ఆ జట్టులో బేత్ మూనీ హాఫ్ సెంచరీ (74 నాటౌట్)తో రాణించింది. ఛేజింగ్లో సఫారీ జట్టు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. లారా వాల్వార్ట్ ఫిఫ్టీ (61) బాదినా ఆసీస్ బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో, సఫారీ జట్టు ఏమాత్రం కోలుకోలేకపోయింది.