WPL 2024: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో గతేడాది విజయవంతంగా నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్కు సిద్ధమవుతోంది. కొద్దిరోజుల క్రితమే సెకండ్ సీజన్ కోసం వేలం ప్రక్రియ కూడా ముగిసిన విషయం తెలిసిందే. గత సీజన్ మాదిరిగానే ఐదు జట్లు పాల్గొంటున్న రెండో సీజన్ను ఫిబ్రవరి 22 నుంచి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఒక్క ముంబైలోనే జరిగిన మ్యాచ్లు.. తాజా సీజన్లో మాత్రం రెండు నగరాల్లో జరుగనున్నాయి.. బెంగళూరు, ఢిల్లీ నగరాలు డబ్ల్యూపీఎల్ సెకండ్ సీజన్కు ఆతిథ్యమివ్వనున్నాయి.
ఈ సీజన్లో వేదికల మార్పు మినహా ఫార్మాట్లో ఎటువంటి మార్పూ లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే లీగ్ దశలో టాప్ – 3లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్ ఆడతాయి. ప్లేఆఫ్స్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఆ మ్యాచ్లో గెలచిన విజేతతో ఫైనల్ పోరు జరుగుతుంది. త్వరలోనే డబ్ల్యూపీఎల్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కానుందని బీసీసీఐ వర్గాల సమాచారం. ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగబోయే ఈ టోర్నీలో గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్లు తలపడనున్నాయి.
WPL to commence from 22nd February in Bengaluru.
– The Final will be played in Delhi. (Revsportz). pic.twitter.com/hzThEEHVDm
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024