గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా భారత జట్టు ప్రపంచకప్ను ముద్దాడలేకపోయింది. చివరగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్లలో గెలుపు రుచిచూడలేదు. చివరగా 2021 టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించి ఇటు అభిమానులతోపాటు, మాజీల నుంచి కూడా విమర్శలు అందుకుంది.
ఈ టోర్నీ తర్వాత మళ్లీ టీమిండియా గడపతొక్కని స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. వచ్చే ఐపీఎల్ 2022 సీజన్ కోసం సిద్ధమవతున్నారు. ఈ క్రమంలో తన ప్రిపరేషన్ల గురించి మాట్లాడిన ఈ స్టార ఆటగాడు.. ఐపీఎల్ తనకు మంచి ప్రిపరేషన్ అందిస్తుందని, దాని ఆధారంగా ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్నానని చెప్పాడు.
తన చూపు ప్రపంచకప్ మీదనే ఉందని, భారత్కు వరల్డ్ కప్ అందించడం తన పిచ్చి కోరిక అని చెప్పాడు. ప్రపంచకప్ సమయానికి అత్యుత్తమ ఫామ్లో ఉండటమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. గడిచిన టీ20 ప్రపంచకప్లో పాండ్యా సరిగా రాణించని సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టులో అతని స్థానంలో వెంకటేష్ అయ్యర్కు చోటిచ్చారు.
అయితే అంతర్జాతీయ స్థాయిలో వెంకటేశ్ అయ్యర్ సత్తా చాటలేకపోయాడు. వెస్టిండీస్తో జరిగే సిరీస్లో కూడా అతను రాణించకపోతే అయ్యర్ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో పాండ్యా ఫామ్లోకి వస్తే సెలెక్టర్ల మొదటి ఓటు పాండ్యాకే పడే అవకాశం లేకపోలేదు.