భోపాల్: ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. జాతీయ బాక్సింగ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో గురువారం నిఖత్ 5-0తో ఈవా మార్బానియాంగ్ (మేఘాలయ)పై గెలిచింది. తొలి రౌండ్లో సునాయాసంగా నెగ్గిన నిఖత్.. ప్రిక్వార్టర్స్లో అదే జోరు కొనసాగించింది.
ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని ఈ తెలంగాణ స్టార్.. ఏకపక్ష విజయం ఖాతాలో వేసుకుంది. ఇతర బౌట్లలో మంజురాణి (48 కేజీలు), జ్యోతి గులియా (52 కేజీలు), సిమ్రన్ (48 కేజీలు), దివ్య (54 కేజీలు) విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు.