యోసు(కొరియా): భారత యువ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్శెట్టి అప్రతిహత విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. టోర్నీ ఏదైనా టైటిల్ తమదే అన్న రీతిలో ఈ ద్వయం వరుస విజయాలతో దూసుకెళుతున్నది. కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్, చిరాగ్ జోడీ విజేతగా నిలిచింది.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత ద్వయం 17-21, 21-13, 21-14తో ప్రపంచ నంబర్వన్ జోడీ ఫజర్ అల్ఫియాన్, మహమ్మద్ రియాన్పై అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో తొలి గేమ్ను చేజార్చుకున్న సాత్విక్, చిరాగ్ జంట అద్భుతంగా పుంజుకుంది. ఈ ఏడాది నాలుగో ఫైనల్లో బరిలోకి దిగిన ఈ యువ జోడీ ప్రత్యర్థి ఊహించని రీతిలో అద్భుతమైన స్మాష్లు, డ్రాప్షాట్లు, సుదీర్ఘ స్మాష్లతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది.