హామిల్టన్: ఐసీసీ మహిళా ప్రపంచకప్ (Women’s World Cup)లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ మిథాలీ రాజ్ నమ్మకాన్ని ఓపెనర్లు నిలబెట్టారు. స్టార్ బ్యాట్స్ ఉమెన్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, యస్తికా భాటియా 31 పరుగులు చేసి మొదటి వికెట్గా వెనుతిరిగింది. ఇక తర్వాత వచ్చిన మిథాలీ రాజ్ (5), దీప్తీ శర్మ (15) అంతగా ఆకట్టుకోకపోయినా.. హర్మన్ప్రీత్ కౌర్ బ్యాట్కు పనిచేబుతున్నది. 30 ఓవర్లు ముగిసే సరికి టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మృతి (84 బాల్స్లో 73 పరుగులు), హర్మన్ (58 బంతుల్లో 46 రన్స్) క్రీజ్లో ఉన్నారు. ప్రపంచకప్లో స్మృతికి ఇది రెండో హాఫ్సెంచరీ.
Smriti Mandhana brings up her second fifty of #CWC22 🔥 pic.twitter.com/BcOzPn2W2V
— ICC Cricket World Cup (@cricketworldcup) March 12, 2022