ముంబై: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్కప్లో ఆడబోయే.. భారత జట్టు(Team India)ను ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. భారత బృందానికి హర్మన్ప్రీత్ కౌర్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నది. 9వ ఎడిషన్కు చెందిన వరల్డ్కప్ .. ఈసారి యూఏఈలో జరగనున్నది. టీ20 వరల్డ్కప్కు ఎన్నికైన ప్లేయర్లలో స్మృతి మందాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తికా భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ థాకూర్, దయాలన్ హేమలత, ఆషా శోభనా, రాధా యాదవ్, శ్రేయాంక్ పాటిల్, సజనా సజీవన్ ఉన్నారు.
🚨 NEWS 🚨
Presenting #TeamIndia‘s squad for the ICC Women’s T20 World Cup 2024 🙌 #T20WorldCup pic.twitter.com/KetQXVsVLX
— BCCI Women (@BCCIWomen) August 27, 2024
టీ20 ప్రపంచకప్-2024 సవరించిన షెడ్యూల్ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా దుబాయ్, షార్జా వేదికలుగా జరగుబోయే ఈ మెగా టోర్నీలో భారత్.. అక్టోబర్ 4న న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ద్వారా టైటిల్ వేటను ఆరంభించనుంది. దాయాది పాకిస్థాన్తో 6న తలపడనుంది. గ్రూపు దశలో టీమ్ఇండియా.. 9న శ్రీలంకతో 13న ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది.
పది జట్లను రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి.