ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ముంబైలో ఈ నెల 13న జరిగే వేలంలో మొత్తం 409 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 246 మంది భారతీయులు కాగా మిగిలిన 163 వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు. ఈ 409 మంది ప్లేయర్లలో 202 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 199 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం ఐదు జట్లలో 90 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రూ.50 లక్షల కేటగిరీలో 24 మంది ప్లేయర్లు ఉండగా, రూ.40 లక్షల విభాగంలో 30 మంది ఉన్నారు.
భారత్ నుంచి హర్మన్ప్రీత్కౌర్, స్మృతి మందన, షెఫాలీవర్మ, దీప్తిశర్మ, స్నేహ్రానా, జెమీమా రోడ్రిగ్స్తో పాటు అలీస్సా హిలీ, ఎకల్స్టోన్, నాట్ స్కీవర్, మెగ్ లానింగ్ ఉన్నారు. మార్చి 4నుంచి మొదలయ్యే డబ్ల్యూపీఎల్లో 22 మ్యాచ్లు జరుగుతాయి.