దోహా: 2023 ఆసియాకప్ అర్హత ఆశలను నిలుపుకోవాలంటే తప్పక గెలిచి తీరాల్సిన స్థితిలో ఉన్న భారత ఫుట్బాల్ జట్టు బంగ్లాదేశ్ను ఢీకొట్టనుంది. ఫిఫా ప్రపంచకప్, ఆసియాకప్ సంయుక్త క్వాలిఫయర్స్లో భాగంగా సోమవారం బంగ్లాతో టీమ్ఇండియా తలపడనుంది. ఈ పర్యటన తొలి మ్యాచ్లో ఆతిథ్య ఖతార్ చేతిలో 0-1తో ఓడిన సునీల్ ఛెత్రీసేనకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఇప్పటి వరకు క్వాలిఫయర్స్లో ఆరు మ్యాచ్లు ఆడిన భారత్ మూడు పాయింట్లతో గ్రూప్-ఈలో నాలుగో స్థానంలో ఉంది. గ్రూప్లో ఉన్న టాప్-4 జట్లే నేరుగా ఆసియాకప్ మూడో రౌండ్కు క్వాలిఫై కానుండడంతో బంగ్లాను భారత్ కచ్చితంగా నిలువరించి పాయింట్లను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.