పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్-విండీస్ వన్డేలో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్కు షాయి హోప్ (115), కైల్ మేయర్స్ (39) శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన షామ్రా బ్రూక్స్ (35) తనకు లభించిన మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.
బ్రాండన్ కింగ్ (0) విఫలమవగా కెప్టెన్ పూరన్ (74) అదరగొట్టాడు. వెంట వెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన దశలో హోప్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన పూరన్.. ఆ తర్వాత గేరు మార్చే క్రమంలో అవుటయ్యాడు. హోప్ సెంచరీ పూర్తి చేసుకున్నప్పటికీ పూరన్ వెనుతిరిగిన తర్వాత వచ్చిన పావెల్ (13), షెఫర్డ్ (15 నాటౌట్), అకీల్ హుస్సేన్ (8 నాటౌట్) భారీ షాట్లు ఆడలేకపోయారు.
దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి విండీస్ జట్టు 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో చెలరేగగా..దీపక్ హుడా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.