టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ (74) గేర్ మార్చే క్రమంలో పెవిలియన్ చేరాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 44వ ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదిన పూరన్.. ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే అంతకుముందు బాల్ను యార్కర్ వేయబోయి గురి తప్పిన శార్దూల్.. ఈసారి గురి తప్పలేదు. దాంతో లెగ్ వికెట్ను కూల్చిన బంతి పూరన్ను పెవిలియన్ చేర్చింది. ఈ క్రమంలో 247 పరుగుల వద్ద విండీస్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో రావ్మెన్ పావెల్ క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ షాయి హోప్ (107 నాటౌట్) సెంచరీతో ఆకట్టుకున్నాడు.