పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్ధశతకంతో ఆకట్టుకున్న శిఖర్ ధవన్ (58) ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు. హేడెన్ వాల్ష్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు ధవన్ ప్రయత్నించాడు. తొందరపాటుతో ముందుకు దూకడంతో బంతిని సరిగా అంచనా వేయలేక ఫ్లిక్ చేయడంలో విఫలమయ్యాడు.
దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచి మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న పూరన్కు సులభమైన క్యాచ్ వెళ్లింది. దాంతో ధవన్ నిరాశగా వెనుతిరిగాడు. ఈ మ్యాచ్లో కూడా తనకు దక్కిన ఆరంభాన్ని మంచి స్కోరుగా మలుచుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో 23 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 113 పరుగులతో నిలిచింది. గిల్ కూడా మరో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈసారైనా సెంచరీ కల పూర్తి చేసుకుంటాడేమో చూడాలి.