భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ టాస్ గెలిచాడు. ముందుగా తాము బౌలింగ్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో ఈ వన్డే సిరీస్లో భారత జట్టుకు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
పిచ్, వాతావరణాన్ని ఉపయోగించుకోవాలనే ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నట్లు పూరన్ చెప్పాడు. భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా నియమించారు. వర్షం పడేలా ఉండటంతో తాము కూడా ఛేజ్ చేయాలనే అనుకున్నామని ధవన్ చెప్పాడు. మోకాలి గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తొలి రెండు వన్డేలు ఆడటం లేదని బీసీసీఐ కూడా అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో విండీస్ స్టార్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్కు కరోనా సోకడంతో ఈ మ్యాచ్ ఆడటం లేదని పూరన్ తెలిపాడు.
భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
TOSS🪙: West Indies Captain @nicholas_47 wins toss against @BCCI 🇮🇳 captain @SDhawan25. #MenInMaroon will bowl first in Game 1 of the CG United ODI Series at Queens Park Oval 🇹🇹 #WIvIND pic.twitter.com/XFVmWin2gN
— Windies Cricket (@windiescricket) July 22, 2022
A look at our Playing XI for the 1st ODI.
Live – https://t.co/tE4PtTfY9d #WIvIND pic.twitter.com/WuwCljou75
— BCCI (@BCCI) July 22, 2022