NGT | బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో జనం ఒకవైపు తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతుండగా నగరంలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) స్పందించింది. ఒక్కో మ్యాచ్కు వేలా ది లీటర్ల నీరు అవసరమవుతున్న నేపథ్యంలో అంత నీటిని ఎక్కడ్నుంచి తీసుకొస్తున్నారని కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్తో పాటు బెంగళూరు వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు, కర్నాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులను ప్రశ్నించింది. చిన్నస్వామిలో మ్యాచ్ల నిర్వహణకు ఎంత నీటిని వాడుతున్నారు..? వాటిని ఎక్కడ్నుంచి తీసుకొస్తున్నారు..? వంటి వివరాలను తమకు మే 2 లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది.