IND vs ENG : పొట్టి ప్రపంచకప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ (India), ఇంగ్లండ్ (England) మ్యాచ్ ఆలస్యం కానుంది. వర్షం కారణంగా ప్రొడిడెన్స్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. దాంతో, అంపైర్లు షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు వేయాల్సిన టాస్ను వాయిదా వేశారు. మైదానంలో ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. దాంతో, సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పేశారు.
గురువారం ఉదయం నుంచే గయానాలో వాన దంచడం మొదలెట్టింది. దాంతో, అక్కడి ప్రొవిడెన్స్ స్టేడియం (Providence Stadium)లోని పిచ్ను పూర్తిగా కప్పేశారు. వాన తగ్గాక ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం మైదానంలోకి వచ్చారు. అయితే.. అంతలోనే మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో, అందరూ డ్రెస్సింగ్ రూమ్కు పరుగెత్తారు.
ఔట్ ఫీల్డ్ బాగా తడిగా ఉంటే మ్యాచ్ రద్దయ్యే చాన్స్ ఉంది. అదే జరిగితే గ్రూప్ దశలో, సూపర్ 8లో అజేయంగా ఉన్న రోహిత్ బృందం ఫైనల్కు దూసుకెళ్లుంది. అప్పుడు వరుసగా రెండోసారి ఫైనల్కు వెళ్లాలనుకున్న ఇంగ్లండ్ ఆశలు ఆవిరైనట్టే.
Guyana 📍
The toss between India and England has been delayed due to rain ☔#T20WorldCup | #INDvENG | 📝: https://t.co/AXRcwJUYYq pic.twitter.com/X77DZL4hQf
— ICC (@ICC) June 27, 2024
ఐసీసీ నిబంధనల ప్రకారం సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో కనీసం 10 ఓవర్లు ఆడించాలి. ఓవర్లు కుదించాల్సి వస్తే ఒక్కో జట్టు 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ అది కూడా సాధ్యపడకుంటే సూపర్ 8లో టాప్లో ఉన్న టీమ్ ఫైనల్లో అడుగుపెడుతుంది. అలాకాకుండా మ్యాచ్ టై అయి వాతావరణం అనుకూలించక సూపర్ ఓవర్ నిర్వహించడం వీలు పడలేదు అనుకోండి.. అప్పుడు కూడా సూపర్ 8 దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు ఫైనల్కు దూసుకెళ్తుంది.