IND vs WI : భారత్ – వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్(ODI Series)లో కీలకమైన రెండో వన్డే బార్బడాస్లోని కెన్షింగ్టన్ ఓవల్(Kensington Oval)లో జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయి హోప్(Shai Hope) భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇరుజట్లు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆడడం లేదు.
వీళ్ల స్థానంలో సంజూ శాంసన్(Sanju Samson), అక్షర్ పటేల్(Axar Patel) జట్టులోకి వచ్చారు. దాంతో, హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇక విండీస్ తరఫున అల్జారీ జోసెఫ్, కీసీ కార్టీ ఆడనున్నారు. తొలి వన్డేలో దుమ్మరేపిన టీమిండియా బ్యాటర్లు మరోసారి చెలరేగాలని భావిస్తున్నారు. ఇరుజట్ల 11 మంది ఆటగాళ్లు వీళ్లే.
భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్మన్ గిల్, సంజూ శాంసన్ , సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, ఇషాకిషన్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్.
వెస్టిండీస్: షాయి హోప్(కెప్టెన్), కింగ్, కైలీ మేయర్స్, కార్టీ, హెట్మైర్, అల్జారీ జోసెఫ్, షెఫర్డ్, సింక్లేయిర్, జోసెఫ్, గుడంకేశ్ మోతీ, జైడేన్ సీల్స్, కేసి కార్టీ.