చెన్నై: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా సమయం రానే వచ్చింది. రేపటి (అక్టోబర్ 5) నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. గత వరల్డ్ కప్ విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ వరల్డ్ కప్లో భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది.
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో అక్టోబర్ 8న ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు ఇవాళ చెన్నైకి చేరుకున్నాయి. చెన్నై ఎయిర్పోర్టులో దిగిన రెండు జట్ల ఆటగాళ్లు.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో హోటళ్లకు బయలుదేరిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Tamil Nadu: Players of Indian and Australian Men’s Cricket team for World Cup 2023 arrive at Chennai Airport
India will face Australia on 8th October at MA Chidambaram Stadium in Chennai. pic.twitter.com/eOl80lKpRu
— ANI (@ANI) October 4, 2023