Akash Chopra : తొలి టెస్టులో భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ(Virat Kohli), ఛతేశ్వర్ పూజారా(Chateshwr Pujara)లు లేని లోటు తెలిసొచ్చింది. ఈ పరాజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023-25)లో ఐదో స్థానానికి పడిపోయిన రోహిత్ సేన రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సిరీస్లో కీలకమైన వైజాగ్ టెస్టులో గెలవాలంటే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిందేనని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా(Akash Chopra) ఎక్స్ ఖాతా వేదికగా సూచించాడు.
తొలి రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమైన శుభ్మన్ గిల్(Shubman Gill)ను మళ్లీ ఓపెనర్గా పంపాలని సలహా ఇచ్చాడు. ‘రెండో టెస్టులో యశస్వీ జైస్వాల్, గిల్ ఇన్నింగ్స్ను ప్రారంభించాలి. రోహిత్ శర్మ మూడో స్థానంలో ఆడితే బెటర్. ఎందుకంటే.. గిల్ బ్యాటింగ్ కోసం ఎదురుచూడాల్సిన శ్రమ తప్పుతుంది. పైగా రోహిత్ స్పిన్ను బాగా ఆడతాడు. అందుకని మూడో స్థానంలో ఆడడంలో హిట్మ్యాన్కు పెద్ద ఇబ్బందేమీ ఉండదు’ అని జాఫ్ వెల్లడించాడు.
Gill and Jaiswal should open and Rohit should bat at no.3 in 2nd test in my opinion. Waiting to bat for his turn isn’t helping Shubman, it’s better he opens the inn. Rohit plays spin really well, so batting at no.3 should not worry him too much. #INDvENG
— Wasim Jaffer (@WasimJaffer14) January 29, 2024
నిరుడు ఓపెనర్గా శతకాల మోత మోగించిన గిల్ మూడో స్థానానికి మారాక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా అడేలేదు. మూడో స్థానంలో ఐదు టెస్టలు ఆడిన గిల్ కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. దాంతో, 21 టెస్టుల అనుభవం ఉన్న అతడి సగటు 29.52కు పడిపోవడం క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఇంగ్లండ్తో తొలి టెస్టులో గిల్ వైఫల్యానికి కారణం స్ట్రయిక్ రొటేట్ చేయకపోవడమే అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
శుభ్మన్ గిల్
‘స్ట్రయిక్ రొటేట్ చేయకపోవడంతోనే గిల్పై ఒత్తిడి పెరిగిపోతోంది. దాంతో, తొలి ఇన్నింగ్స్లో అతడు భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు’ అని పీటర్సన్ చెప్పాడు. రెండో ఇన్నింగ్స్లో ఓలీ పోప్ 196 278 బంతుల్లో 21 ఫోర్లు ఖతర్నాక్ సెంచరీతో ఇంగ్లండ్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అనంతరం అరంగేట్రం స్పిన్నర్ టామ్ హర్ట్లే 7 వికెట్లతో ఇంగ్లండ్ను గెలిపించాడు. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 2న విశాఖపట్టణంలో రెండో టెస్టు జరుగనుంది.