Pakistan Cricket : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) కీలక నిర్ణయం తీసుకుంది. పురుషుల సీనియర్ జట్టును గాడిలో పెట్టేందుకు అనుభవజ్ఞులైన కొత్త హెడ్ కోచ్లుగా నియమించింది. ప్రతిష్ఠాత్మక పొట్టి ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లను దృష్టిలో ఉంచుకొని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టెన్(Gary Kirsten)ను హెడ్కోచ్గా ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జేసన్ గిలెస్పీ(Jason Gillespie)ను టెస్టు జట్టుకు హెడ్కోచ్గా తీసుకుంది.
ఈ ఇద్దరు దిగ్గజాల నియామకాన్ని ధ్రువీకరిస్తూ ఆదివారం పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేకంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) కొత్త కోచ్ల పేర్లను వెల్లడించాడు. నిరుడు వన్డే వరల్డ్ కప్ తర్వాత విదేశీ కోచ్లకు మంగళం పాడిన పీసీబీకి మళ్లీ వాళ్లే దిక్కవ్వడం గమనార్హం.
— Pakistan Cricket (@TheRealPCB) April 28, 2024
కోచ్గా సుదీర్ఘ అనుభవం ఉన్న కిర్స్టెన్ జాన్ రైట్ తర్వాత భారత జట్టు కోచ్గా చేరాడు. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సారథ్యంలోని టీమిండియా 2011లో వరల్డ్ కప్ గెలవడంలో ఈ సఫారీ మాజీ ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టుకు కిర్స్టెన్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.
— Pakistan Cricket (@TheRealPCB) April 28, 2024
ఇక మాజీ పేసర్ గిలెస్పీ విషయానికొస్తే.. మనోడికి సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవం బోలెడు. ఆగస్టులో సొంతగడ్డపై బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్ రూపంలో గిలెస్పీకి తొలి పరీక్ష ఎదురవ్వనుంది. కిర్స్టెన్, గిలెస్పీతో పాటు పాక్ మాజీ క్రికెటర్ అజర్ మహమూద్ కూడా కోచింగ్ యూనిట్లో భాగం కానున్నాడు. ఇతడు మూడు ఫార్మట్లకు అసిస్టెంట్ కోచ్గా నియమితులయ్యాడు.