హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులతో క్యాబ్ డ్రైవర్(Cab driver) ఉరి వేసుకొని ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న విషాదకర సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా శంకరంపేట గ్రామానికి చెందిన అరికెల మహేశ్(28) నగరానికి వలస వచ్చి కొంపల్లిలో నార్త్ ఎన్సీఎల్లో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోశించుకుంటున్నాడు.
కాగా, ఇటివల ఒక ట్రాలీ ఆటోను కొనుగోలు చేసి నడుపుతుండగా ఆర్థిక ఇబ్బందులతో నిత్యం మనోవేదనకు గురై ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.