హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): భారత క్రికెటర్లు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గురువారం సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా వారు సింహాచలం అప్పన్న దర్శనం చేసుకున్నారు.
సిరీస్లో రాణించాలని, జట్టు విజయం సాధించాలని వారు స్వామివారిని కోరుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి ఆశీర్వచనం అందించారు. యువకులతో నిండిన భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారధ్యం వహిస్తుండగా, రెండు జట్లు అయిదు మ్యాచ్ల సిరీస్లో తలపడుతున్నాయి.