క్రికెట్ నుంచి కొంత విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. తన టైంను జీవిత భాగస్వామి అనుష్క శర్మతో గడుపుతున్నాడు. ఇటీవలే భార్యాపిల్లలతో కలిసి యూరప్ చుట్టొచ్చిన కోహ్లీ.. తాజాగా ముంబైలోని మఢ్ ఐలాండ్లో భార్యతో కలిసి స్కూటీపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఒక ప్రాజెక్ట్ షూట్లో పాల్గొన్న వీళ్లిద్దరూ అదే దుస్తులతో యాక్సెస్ 125 స్కూటీపై సిటీలో షికారు చేశారు. ఈ సమయంలో తమ మొఖాలు కనిపించకుండా నల్లటి అద్దాలున్న హెల్మెట్లు పెట్టుకున్నారు.
అయితే ఈ సెలెబ్రిటీ కపుల్ చుట్టూ తిరిగే అన్ని డేగ కళ్లను వాళ్లు తప్పించుకోలేకపోయారు. దీంతో వారిని అనుసరించిన కొందరు స్కూటీపై వెళ్తున్న ఈ జంటను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన కోహ్లీ.. ఆ తర్వాత విండీస్, జింబాబ్వే పర్యటనల నుంచి విశ్రాంతి తీసుకున్నాడు.
ఈ నెలాఖరు నుంచి మొదలయ్యే ఆసియా కప్లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. అదే సమయంలో మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చక్డా ఎక్స్ప్రెస్ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.
Kohli & Anushka on a scooty. Also goes to one of the richest celeb couples have to endure such poor road infrastructure. 3rd world. pic.twitter.com/og3PndwRLy
— Gabbbar (@GabbbarSingh) August 20, 2022