చెన్నై: ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిని మ్యాచ్ రిఫరీ మందలించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అతను ఉల్లంఘించాడన్న కారణంగా రిఫరీ ఈ చర్య తీసుకున్నాడు. బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి సహనం కోల్పోయాడు. 29 బంతుల్లో 33 పరుగులు చేసి అవుటైన కోహ్లి.. ఆర్సీబీ డగౌట్ వైపు వెళ్తూ బౌండరీ దగ్గర అడ్వర్టైజింగ్ బోర్డు, ఆ తర్వాత ఓ కుర్చీని బ్యాట్తో కొడుతూ వెళ్లాడు.
ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం లెవల్ 1 నేరం. క్రికెట్ పరికరాలు లేదా బట్టలు, మైదానంలోని పరికరాలు, హోర్డింగ్ల పట్ల మ్యాచ్ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించడానికి నేరంగా పరిగణిస్తారు. దీని ప్రకారం కోహ్లిది లెవల్ 1 నేరంగా ప్రకటించిన రిఫరీ అతన్ని మందలింపుతో వదిలేసినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం
అలియా భట్కు కరోనా నెగెటివ్.. ఊపందుకోనున్న ప్రాజెక్ట్స్
విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి