ముంబై: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ సవాల్తో కూడుకున్నదేనని, అయితే తనపై ఏ మాత్రం ఒత్తిడి ఉందని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రాక్టీస్లేమి పెద్ద సమస్యే కాదని చెప్పాడు. జూన్ 18 నుంచి న్యూజిలాండ్తో డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు టీమ్ఇండియా బుధవారం బ్రిటన్కు బయలుదేరింది. ఇంగ్లండ్కు పయనమయ్యే ముందు కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడాడు. మేం ఇంగ్లండ్లో ఆడడం ఇదే తొలిసారి కాదు. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. అందుకే ప్రాక్టీస్కు తక్కువ సమయం ఉండడం పెద్ద సమస్య కాదు. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు.
డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు మధ్య ఎక్కువ విరామం ఉండడం జట్టుకు మంచిదే అని కోహ్లీ చెప్పాడు. ముంబైలో 14 రోజుల క్వారంటైన్ తర్వాత ప్లేయర్లు, సహాయ సిబ్బంది బుధవారం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్కు పయనమయ్యారు. కోహ్లీసేన గురువారం సౌతాంప్టన్ చేరుకొని అక్కడ ఐసొలేషన్లో ఉండనుంది. ఆర్టీ-పీసీఆర్లో కరోనా నెగెటివ్గా నిర్ధారణ అయ్యాక ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.
ఈ నెల 18 నుంచి 22 మధ్య ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. పురుషుల జట్టుతో పాటే భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్ బయలుదేరింది. ఇంగ్లిష్ మహిళల జట్టుతో భారత్ ఓ టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
ఏకకాలంలో రెండు భారత జట్లు ఆడడం భవిష్యత్తులోనూ అవసరమవుతుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బయోబబుల్స్లో సుదీర్ఘ కాలం ఉండాల్సి వస్తుండడంతో ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పాడు. అందుకే ఎక్కువ సిరీస్లు జరుగాలంటే రెండు భారత జట్లు ఏకకాలంలో ఆడాల్సి రావొచ్చని అన్నాడు. ఒకవేళ ఒలింపిక్స్ లాంటి సుదీర్ఘ టోర్నీల్లో క్రికెట్ ఆడాలంటే ఎక్కువ జట్లు ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. అలాగే ఆటగాళ్లు మానసికంగా ఊరట చెందేందుకు, పని ఒత్తిడి తగ్గేందుకు కూడా రెండు జట్ల వ్యూహం బాగుంటుందని అన్నాడు. ఆటగాళ్లకు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశమని, దీన్ని విస్మరించకూడదని విరాట్ స్పష్టం చేశాడు. కాగా కోహ్లీసేన ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సమయంలోనే జూలైలో భారత్ నుంచి మరో జట్టు శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్.. బెస్ట్ ఆఫ్ త్రీగా ఉంటే బాగుంటుందని టీమ్ఇండియా హెడ్కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఈసారికి ఒకే తుదిపోరు ఉందని, తర్వాతి ఎడిషన్లలో విజేతను తేల్చేందుకు మూడు మ్యాచ్లు పెడితే మేలని చెప్పాడు. ‘రెండున్నరేండ్లలో మెరుగైన ప్రదర్శన చేశాక రెండు జట్లు చాంపియన్షిప్ ఫైనల్ చేరుకుంటాయి. అందుకే విజేతను తేల్చేందుకు మూడు టెస్టుల సిరీస్ నిర్వహిస్తే బాగుంటుంది’ అని శాస్త్రి చెప్పాడు.