జొహన్నెస్బర్గ్: భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి గురువారం జొహన్నెస్బర్గ్కు చేరుకుంది. దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన ఆటగాళ్ల ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అత్యంత జాగ్రత్తల నడుమ ఈ పర్యటన కొనసాగనుంది. ఇరు జట్లు బయోబబుల్లోకి వెళ్లనున్నాయి.