టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అరుదైన మైలురాయి అందుకున్నాడు. 100 టెస్టులు ఆడిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అయితే ఈ మ్యాచ్లో 45 పరుగుల స్కోరు వద్ద ఎంబుల్డెయా వేసిన బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు.
దీంతో కోహ్లీ 71వ సెంచరీ కోసం ఎదురు చూస్తున్న కోహ్లీ అభిమానులు నిరాశ చెందారు. కానీ అతను పెవిలియన్కు వచ్చేటప్పుడు ప్రేక్షకులంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో భారత జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అనంతరం టీం బస్సు ఎక్కేముందు కోహ్లీ చేసిన పని వైరల్ అవుతోంది.
ధరమ్వీర్ పాల్ అనే అభిమానిని టీమిండియ 12వ ఆటగాడని అంటారు. దివ్యాంగుడైన అతనికి కోహ్లీ.. తన టీషర్టును బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న పాల్.. “నేను ఇది నమ్మలేకపోతున్నాను. మొహాలీ టెస్టు తర్వాత కోహ్లీ.. నాకు టీషర్టు గిఫ్ట్ ఇచ్చాడు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ అభిమానులంతా కోహ్లీ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.
Wow it's great day my life @imVkohli he's 100th test match he's gifts me t shirts wow 😲 #viratkholi #ViratKohli100thTest #KingKohli pic.twitter.com/mxALApy89H
— dharamofficialcricket (@dharmveerpal) March 6, 2022