ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తన ఆల్రౌండ్ ప్రతిభతో పాండ్యా జట్టును విజయతీరాలకు చేర్చాడు. అదే సమయంలో స్టార్ బ్యాటర్ కోహ్లీ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ చేసిన పని నెట్టింట వైరల్గా మారింది.
మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్తో కోహ్లీ సరదాగా మాట్లాడాడు. ఆ తర్వాత తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి, దాన్ని పాకిస్తాన్ పేసర్ రవూఫ్కు గిఫ్ట్గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న బీసీసీఐ.. ‘‘మ్యాచ్ ముగిసినా కూడా ఇలాంటి క్షణాలు మరింత ధగధగలాడతాయి. పాకిస్తాన్ ఆటగాడు హారిస్ రవూఫ్కు సైన్ చేసిన జెర్సీని కోహ్లీ అందజేశాడు’’ అని పేర్కొంది.
The match may be over but moments like these shine bright ✨👌
A heartwarming gesture by @imVkohli as he hands over a signed jersey to Pakistan's Haris Rauf post the #INDvPAK game 👏👏#TeamIndia | #AsiaCup2022 pic.twitter.com/3qqejMKHjG
— BCCI (@BCCI) August 29, 2022